- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఆదివారం కొత్తగా మరో 28 కరోనా కేసులు నమోదు అయ్యాయి. అలాగే మరో ఇద్దరు మృతి చెందినట్లు వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్లో పేర్కొన్నారు. వైరస్ బారిన పడి పూర్తిగా ఏడుగురు కోలుకోగా డిశ్చార్జ్ అయినట్లు ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో డిశ్చార్జ్ల సంఖ్య 103కి చేరగా, మొత్తం మృతుల సంఖ్య 16కి పెరిగింది. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో 412 మంది చికిత్స పొందుతున్నారని, ఎవరికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యారోగ్యశాఖ తెలిపింది. వీరంతా నిజాముద్దీన్ మర్కజ్తో లింక్ ఉన్నవారు, వారి బంధువులేనని తెలిసింది.
28 new corona cases registered
- Advertisement -