న్యూఢిల్లీ: భారత్ లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. దేశంలో గత 24 గంటల్లో అత్యధికంగా 28,637 కొత్త కోవిడ్-19 కేసులు, 551 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇండియాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,49,553కి చేరింది. వీటిలో 2,92,258 యాక్టివ్ కేసులుండగా… ఇప్పటివరకు 5,34,621 నయమై కోలుకున్నారు. దేశవ్యాప్తంగా 22,674మందిని కరోనా మహమ్మారి కబలించింది. భారత్ లో రోజురోజుకూ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో కరోనా కరాళనృత్యం చేస్తోంది. రాష్ట్రంలో 2,46,600 మందికి కరోనా వైరస్ సోకింది. ఇప్పటివరకు 10,116 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం 99,499 యాక్టివ్ కేసులుండగా…1,36,985 కోవిడ్ నుంచి కోలుకున్నారు.
తమిళనాడులో 1,34,226 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 1898 మంది చనిపోయారు. ఢిల్లీలో 1,02,831 మందికి కోవిడ్ సోకింది. ఇప్పటివరకు 3,165 మంది చనిపోగా… 74,217 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గుజరాత్ లో కరోనా కేసులు యాభై వేలకు చేరువ కాగా… 2034 మంది కరోనా ప్రాణాలు కోల్పోయారు. అటు ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉదృతి కొనసాగుతోంది. ప్రపంచంలో కోటి 28లక్షల 42వేల మందికి కరోనా వైరస్ సోకింది. ఇప్పటివరకు 5,67,653మంది కరోనాతో మృతి చెందారు. 74,78,196 మంది బాధితులు కోవిడ్ నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. అగ్రరాజ్యంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. 33.55 లక్షలకు పైగా మందికి కరోనా సోకింది. యుఎస్ లో 1.37లక్షల మంది కరోనాతో ప్రాణాలు విడిచారు.
28637 COVID 19 cases and 551 deaths in India