న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. గత 24 గంటల్లో భారత్ లో 28,701 కొత్త కోవిడ్-19 కేసులు, 500 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇండియాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,78,254కి చేరాయి. వీటిలో 3,01,609 యాక్టివ్ కేసులుండగా… 5,53,471 నయమై కోలుకున్నారు. దేశవ్యాప్తంగా 23,174 మంది బాధితులు కరోనాతో మరణించినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొంది. అటు మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతోంది.
కేసులు బారీగా పెరుగుతున్నాయి. మహారాష్ట్రాలో ఇప్పటివరకు 2,54,427మందికి కరోనా వైరస్ సోకింది. 1,03,516మంది బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా… 10,289 మంది కరోనాతో ప్రాణాలు విడిచారు. 1,40,325 మంది కోవిడ్ తో కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. తమిళనాడులో1,38,470 మందికి కరోనా సోకగా.. 1,966 మంది ఈ వైరస్ బారిన పడి మృతి చెందారు. దేశరాజధాని ఢిల్లీ 3,371 మంది కరోనా తో చనిపోగా… 1,12,494మందికి కోవిడ్ మహమ్మారి సోకింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతోంది.
28701 new COVID 19 cases And 500 deaths in India