- Advertisement -
అమరావతిః ఆంధ్రప్రదేశ్లో మహమ్మారి కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఎపిలో 294 కొత్త కరోనా పాజిటీవ్ కేసులు నమోదైనట్లు, మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ తాజా హెల్త్ బులెటిన్లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,152కు చేరింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 84 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో 2,034 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇక, కరోనా నుంచి ఇప్పటివరకు 2,723మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
294 New Corona Cases Registered in AP
- Advertisement -