Wednesday, May 8, 2024

గత 24 గంటల్లో రికవరీల కంటే పాజిటీవ్ కేసులే ఎక్కువ

- Advertisement -
- Advertisement -

29616 New Corona Cases Reported in India

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 29,616 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. కరోనాతో మరో 290మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3.36 కోట్లకు చేరింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 4,46,658 మంది కరోనాతో చనిపోయారు. గత 24 గంటల్లో కరోనా నుంచి 28,046 కోలుకోగా, దేశవ్యాప్తంగా మొత్తం 3.28కోట్ల మంది బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 3,01,442 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు మొత్తం 84,89,29,160 కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేసినట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది.

29616 New Corona Cases Reported in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News