Sunday, May 5, 2024

లారీ బోల్తా… ముగ్గురు మృతి…. 40 ఆవులు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

3 Men, 40 Cows Killed As Cattle-Laden Truck Overturns

భువనేశ్వర్: లారీ బోల్తా పడిన సంఘటనలో ముగ్గురుతో పాటు 40 ఆవులు మృతి చెందిన సంఘటన ఒడిశా రాష్ట్రం బాలాసోర్ జిల్లా ఎన్ హెచ్-60 జాతీయ రహదారిపై గురువారం ఉదయం జరిగింది. వంద గోవులను భద్రాక్ ప్రాంతం నుంచి పశ్చిమ బెంగాల్ కు తరలిస్తుండగా బస్తా జాతీయ రహదారిపై ట్రక్కు బోల్తాపడడంతో ముగ్గురు వ్యక్తులతో పాటు 40 ఆవులు ఘటనా స్థలంలోనే చనిపోయాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని పోలీసులు అధికారులు వెల్లడించారు. శవపరీక్ష నిర్వహించన అనంతరం ఆవు కళేబరాలను గుంత తీసి పడేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News