Friday, May 10, 2024

మరో 163 మందికి వైరస్

- Advertisement -
- Advertisement -

163 new covid-19 cases reported in telangana

జిహెచ్‌ఎంసి పరిధిలో 31, జిల్లాల్లో 132 పాజిటివ్‌లు
2,97,113కి చేరిన కరోనా బాధితుల సంఖ్య

హైదరాబాద్: రాష్ట్రంలో మరో 163 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 31 ఉండగా ఆదిలాబాద్‌లో 5, భద్రాద్రి 6, జగిత్యాల 4, జనగాం 3, భూపాలపల్లి 5, గద్వాల 1, కామారెడ్డి 2, కరీంనగర్ 9,ఖమ్మం 3, ఆసిఫాబాద్ 2, మహబూబ్‌నగర్ 3, మహబూబాబాద్ 1, మంచిర్యాల 7, మెదక్ 2, మేడ్చల్ మల్కాజ్‌గిరి 12, ములుగు 1, నాగర్‌కర్నూల్ 1, నల్గొండ 6, నారాయణపేట్ 0, నిర్మల్ 3, నిజామాబాద్ 4, పెద్దపల్లి 5, సిరిసిల్లా 6, రంగారెడ్డి 12, సంగారెడ్డి 6, సిద్ధిపేట 2, సూర్యాపేట్ 4,వికారాబాద్ 4, వనపర్తి 0, వరంగల్ రూరల్ 4, వరంగల్ అర్బన్ 7, యాదాద్రిలో మరో ఇద్దరికి పాజిటివ్ తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2,97,113కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 2,93,791కి చేరింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో 16, ప్రైవేట్‌లో 44 కేంద్రాల్లో ఆర్‌టిపిసిఆర్ టెస్టులు నిర్వహిస్తుండగా,1076 సెంటర్లలో యంటీజెన్ టెస్టులు నిర్వహిస్తున్నామని హెల్త్ డైరెక్టర్ డా జి శ్రీనివాసరావు తెలిపారు. మాస్కు, భౌతిక దూరం, శానిటేషన్‌తోనే వైరస్ నుంచి దూరంగా ఉండొచ్చని ఆయన అన్నారు. ముఖ్యంగా జనసమ్మర్ధ ప్రాంతాలు, మార్కెట్లలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News