Thursday, May 9, 2024

ట్రాక్టర్ బోల్తా: ఐదుగురి మృతి

- Advertisement -
- Advertisement -

 

భువనేశ్వర్‌ : ట్రాక్టర్ బోల్తాపడడడంతో ఐదుగురు మృతి చెందిన సంఘటన ఒడిశాలోని మయూర్‌భంజ్‌ జిల్లా పరిధిలోని ధిపాసాహిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఒడిశా-ఝార్ఖండ్ సరిహద్దులో సాంస్కృతిక బృందం దమనసాహి గ్రామంలో ప్రదర్శన చేసి తన సొంతూరు బాగ్ బూడకు వెళ్తుండగా మార్గ మధ్యలో ట్రాక్టర్ అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందగా 41 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పండిత్ రఘురామ్ మర్ము మెడికల్ కాలేజీ, బరిపాదా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిని స్థానికులు, పోలీసులు ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులలో పది మంది పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News