- Advertisement -
ఢాకా: నౌకలో మంటలు అంటుకోవడంతో 32 మంది మృతి చెందిన సంఘటన బంగ్లాదేశ్లో జరిగింది. రాజధాని డాకాకు దక్షిణ భాగాన 250 కిలో మీటర్ల దూరంలో జకల్ కాథి ప్రాంతంలో మూడంతస్థుల నౌకలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో 37 సజీవదహనం కాగా 100 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను బరిసోల్లోని ఆస్పత్రులకు తరలించారు. వలస కూలీలు డాకా నుంచి సొంతూళ్లకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ప్రమాదం జరిగినప్పుడు పడవలో 500 మంది ప్రయాణీకులు ఉన్నారు. బంగ్లాదేశ్ లో బోటు ప్రమాదాలు తరచుగా జరుగుతుంటాయి. ఈ సంవత్సరం ఏప్రిల్లో 54 మంది, ఆగస్టులో21 మంది బోటు ప్రమాదంలో దుర్మరణం చెందారు. 2015 ఫిబ్రవరిలో రెండు పడవలు ఢీకొనడంతో 78 మంది చనిపోయారు.
- Advertisement -