- Advertisement -
అమరావతి: ఎపిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. గడిచిన 24 గంటల్లో 10,730 శాంపిళ్లను పరీక్షించగా.. కొత్తగా 33 మందికి కోవిడ్-19 సోకినట్లు ఎపి వైద్య, ఆరోగ్య శాఖ హెల్త బులిటెన్ విడుదల చేసింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 46 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు-10, తూర్పు గోదావరి-1, కృష్ణా-4, నెల్లూరు-9, కర్నూలు -9 కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతొ ఎపిలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,051కి పెరిగింది. ప్రస్తుతం 949 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 1,056 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో 58 మంది కరోనా మహమ్మారి నుంచి డిశ్చార్జ్ అయ్యారని ప్రభుత్వం తెలిపింది.
33 new Covid 19 cases reported in Andhra Pradesh
- Advertisement -