Friday, April 26, 2024

పొలంలో ఎనిమిదో తరగతి బాలికపై అత్యాచారం… హత్య

- Advertisement -
- Advertisement -

rape

 

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రా ప్రాంతం సాయియాన్ పోలీస్ స్టేషన్ పరధిలోని పొలం పనులకు వెళ్లిన ఎనిమిదో తరగతి బాలికపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. సాయియాన్ పోలీస్ స్టేషన్‌కు ఐదు కిలో మీటర్ల దూరంలో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలిక తన తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. పొలం పనులు ఉండడంతో సోమవారం ఉదయం 6.15 గంటలకు బావి దగ్గరుకు వెళ్లింది. మూడు గంటలైన బాలిక తిరిగి  ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు 10.15కు పొలం దగ్గరకు వెళ్లారు. ఎక్కడ చూసిన కనిపించకపోవడంతో గ్రామస్థులతో కలిసి వెతికారు. చెట్ల పొదల్లో బాలిక మృతదేహం కనిపించింది. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతదేహం నగ్నంగా ఉండడంతో బాలికను రేప్ చేసిన అనంతరం హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. గ్రామంలో ఎవరిపైన అనుమానాలు ఉన్నాయా? అని పోలీసులు అడిగి తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు ఐపిసి 302, 376, పొస్కో యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శవ పరీక్ష నమిత్తం మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News