Tuesday, April 30, 2024

భారత్‌లో 3,320 కొత్త కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

Covid-19

న్యూఢిల్లీ: భారత్ తో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. దేశంలో గడిచిన  24 గంటల్లో 3,320 కోవిడ్ -19 పాజిటివ్ కేసులు, 95 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 59,662 కు పెరిగింది. వీటిలో 39,834 మంది బాధితులు దేశంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఈ మహమ్మారి ఇప్పటివరకు 17,847 కోలుకుని నయమయ్యారు. దేశవ్యాప్తతంగా 1,981 మంది కోవిడ్ తో ప్రాణాలు కోల్పోయారు. అటు మహారాష్ట్రలో కరోనా కేసులు విజృంభణ కొనసాగుతోంది. ఒక్క రోజులోనే 1,089 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం కోవిడ్ కేసులు సంఖ్య 19,063 చేరింది. ఇప్పటివరకు 3,470 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా.. మొత్తం 731మంది ప్రాణాలు విడిచారు. కేవలం ముంబైలోనే కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 11,967కి చేరింది. ఈ మహమ్మారి ప్రపంచ దేశాలను గడగడ వణికిస్తోంది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News