జిహెచ్ఎంసి పరిధిలో 71, జిల్లాల్లో 308 మందికి పాజిటివ్
వైరస్ దాడిలో మరో ముగ్గురు మృతి
2,88,789కి చేరిన కోవిడ్ బాధితుల సంఖ్య
హైదరాబాద్: రాష్ట్రంలో మరో 379 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో 71 మంది ఉండగా, ఆదిలాబాద్లో 7, భద్రాద్రి 12,జగిత్యాల 11, జనగాం 6, భూపాలపల్లి 5, గద్వాల 4, కామారెడ్డి 9, కరీంనగర్ 19 ,ఖమ్మం 12, ఆసిఫాబాద్ 7, మహబూబ్నగర్ 7,మహబూబాబాద్ 6, మంచిర్యాల 12, మెదక్ 6, మేడ్చల్ మల్కాజ్గిరి 37, ములుగు 5, నాగర్కర్నూల్ 4, నల్గొండ 12, నారాయణపేట్ 1, నిర్మల్ 3, నిజామాబాద్ 9, పెద్దపల్లి 7, సిరిసిల్లా 8, రంగారెడ్డి 36, సంగారెడ్డి 12, సిద్ధిపేట్ 6, సూర్యాపేట్ 8, వికారాబాద్ 5, వనపర్తి 4, వరంగల్ రూరల్ 7, వరంగల్ అర్బన్ లో 14, యాదాద్రిలో మరో 7 మందికి వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2,88,789కి చేరగా, డిశ్చార్జ్ల సంఖ్య 2,82,177కి చేరింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో 16, ప్రైవేట్లో 44 కేంద్రాల్లో ఆర్టిపిసిఆర్ టెస్టులు నిర్వహిస్తుండగా,1076 సెంటర్లలో యంటీజెన్ టెస్టులు నిర్వహిస్తున్నామని హెల్త్ డైరెక్టర్ తెలిపారు.
379 new covid-19 cases reported telangana