Friday, April 26, 2024

ఆదిలాబాద్ లో రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

4 died in Road Accident in Adilabad

ఆదిలాబాద్: జిల్లా నేరడిగొండ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున మండలంలోని గౌలిగూడ సమీపంలో ఎదురెదురుగా వచ్చిన టాటా సఫారీ, టాటా ఏస్ వాహనాలు ఢీకొన్నాయి. ఆ వెనుకనే వచ్చిన మరో వాహనం.. ఈ రెండు వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, 17మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణం అని పోలీసులు ప్రాథమిక అంచనా వచ్చారు.

4 died in Road Accident in Adilabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News