- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో ప్రస్తుతం 60 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. శాసన సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడారు. మరో 40 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములను నిర్మిస్తున్నామని, వీలైనంత త్వరగా గోదాముల నిర్మాణం పూర్తి చేస్తామని, కొత్త మండలాలలో గోదాముల నిర్మాణం చేపడుతామని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. వరి మాత్రం కొనుగోలు కేంద్రాలు తరలిస్తున్నామని, పత్తి, గోదాములు, శనగలు, కందులతో మిగతా పంటలకు గోదాముల ఆవశ్యకత ఉందన్నారు. గోదాములకు అవసరమైన భూములను కూడా సేకరిస్తున్నామని వివరించారు. గ్రామీణ నియోజకవర్గాల్లో 40 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉండేలా గోదాముల నిర్మాణం చేపడుతామన్నారు.
- Advertisement -