Friday, April 26, 2024

ఎపిలో 432 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

432 new covid-19 cases reported in AP

హైదరాబాద్:  ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టింది. ఎపి వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 31, 712 శాంపిల్స్ పరీక్షించగా 432 కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. మరో 5 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 586 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. తాజా టెస్ట్‌లు కలుపుకుని ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య 2, 89, 85, 846 కు చేరుకున్నాయి.. ఇక, పాజిటివ్ కేసుల సంఖ్య 20,60, 472 కు పెరిగితే.. కోలుకున్నవారి సంఖ్య 20,40, 131 కు చేరుకుంది.. మరోవైపు ఇప్పటి వరకు కోవిడ్ బారినపడి మృతిచెందినవారి సంఖ్య 14,307 కు పెరగగా.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 6,034 యాక్టివ్ కేసులు ఉన్నట్టు వైద్యారోగ్య శాఖ బులెటిన్‌లో పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News