Monday, May 6, 2024

బావిలో పడి ఐదుగురు కూలీలు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

5 died in accident at deep well site in Meghalaya

షిల్లాంగ్: మేఘాలయ పశ్చిమ జయంతియా హిల్స్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బావి నిర్మాణ పనులు చేస్తున్న సమయంలో ఐదుగురు కార్మికులు ప్రమాదవశాత్తు మరణించించారు. జోవాయి పట్టణ శివార్లలోని మిహ్మింట్డు గ్రామంలో 35 మీటర్ల లోతైన బావిలో నిర్మాణ పనులు చేసేందుకు కూలీలు అందులోకి దిగినట్టు బాధితుల కుటుంబీకులు చెబుతున్నారు. ఈ ఘటనలో మరో ఇద్దరిని రక్షించినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న రెస్క్యూ బృందం అక్కడికి చేరుకుని ఐదుగురు వ్యక్తుల మృతదేహాలను వెలికి తీసినట్లు ఫైర్ సర్వీస్ ఎస్పీ ఎగోయెంకా తెలిపారు. నీరు తోడేందుకు ఉపయోగించిన పంపు నుంచి పొగ రావడం వల్ల వారు అపస్మారక స్థితిలో పడిపోయి, ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు.

5 died in accident at deep well site in Meghalaya

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News