Monday, April 29, 2024

ఎదురుకాల్పుల్లో ఐదుగురు జవాన్లు మృతి..

- Advertisement -
- Advertisement -

ఛత్తీస్ ఘడ్ లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. శనివారం బీజాపూర్ జిల్లాలోని సిల్గర్ అటవి ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందడంతో సిఆర్ పిఎఫ్, డిఆర్ జి జవాన్లు కలిసి సంయుక్తంగా కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సమయంలో మావోయిస్టులు జవాన్లపై ఎదురుకాల్పులకు దిగారు. దీంతో ఐదగురు జవాన్లు మరణించగా, మరికొంతమంది జవాన్లు గాయపడినట్లు సమాచారం. మరణించినవారిలో ముగ్గురు సిఆర్ పిఎఫ్ జవాన్లు, ఇద్దరు డిఆర్ జి జవాన్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్ కౌంటర్ లో ఓ మహిళతో సహా ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు ఆర్మీ ఉన్నతాధికారి తెలిపారు. ఇంకా ఎన్ కౌంటర్ కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.

5 Jawan killed in Encounter in Bijapur

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News