Saturday, April 27, 2024

నదిలో పడిన కారు.. ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

Car-accident

రాంచీ: బ్రిడ్జి పైనుంచి వెళ్తున్న కారు అదుపుతప్పి ఖుడియా నదిలో పడిన ఘటన మంగళవారం తెల్లవారుజామున 5:30 గంటలకు జార్ఖండ్‌ ధన్‌బాద్‌ జిల్లా గోవింద్‌పుర్‌ బర్వాలో చోటుచేసుకుంది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. ప్రమాదంలో రెండేళ్ల చిన్నారి, మహిళ సహా ఐదుగురు మృత్యువాత పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కారు జార్ఖండ్‌ నుంచి కోల్‌కతా ప్రయాణిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కారు డ్రైవర్‌ నిద్ర మత్తువల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా వెల్లడైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

5 killed as car hits divider and falls into river

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News