Friday, April 26, 2024

ఎపిలో మరో 48 మందికి సోకిన కరోనా

- Advertisement -
- Advertisement -

corona

అమరావతి: ఎపిలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 8,148 శాంపిళ్లను పరీక్షించగా కొత్తగా 48 కోవిడ్-19 కేసులు, ఒకరు మృతి చెందినట్టు ఎపి వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఎపి కరోనా కేసుల సంఖ్య 2,719కి పెరిగింది. ఇప్పటివరకు కరోనా మహమ్మారితో 57మంది ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం 759 యాక్టివ్ కేసులు ఉండగా… 1,903 మంది కోలుకున్నారు. కొత్తగా నమోదైన కేసుల్లో నాలుగు కోయంబేడు లింకులేనని అధికారులు తెలిపారు. అయితే గడిచిన 24గంటల్లో 55మంది కోవిడ్-19 బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

48 New Coronavirus Positive Cases in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News