Monday, May 6, 2024

బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంతమాగులూరు సమీపంలోని గుంటూరు-కర్నూల్ జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ అదుపుతప్పి ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నరసరావుపేట ఆస్పత్రికి తరలించారు.

కాగా, ముగ్గురు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. చనిపోయిన ఐదుగురిలో నలుగురు మహిళలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News