హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారిన పడిన వారిలో ఇప్పటి వరకు రెండు లక్షల 75 వేల 708 మంది ఆరోగ్యవంతులుగా మారారు. దీంతో రికవరీ రేట్ కూడా 97.05 శాతానికి పెరిగింది. అంటే ప్రతి వందలో 97 మంది సులువుగా కోలుకుంటున్నారని వైద్యశాఖ తెలిపింది. ఇదిలా ఉండగా గురువారం 44,869 మందికి టెస్టు చేయగా 518 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో 91 మంది ఉండగా, ఆదిలాబాద్లో 7, భద్రాద్రి 16 , జగిత్యాల 14, జనగాం 7, భూపాలపల్లి 6, గద్వాల 3, కామారెడ్డి 0, కరీంనగర్ 25,ఖమ్మం 26, ఆసిఫాబాద్ 4, మహబూబ్నగర్ 6, మహబూబాబాద్ 10, మంచిర్యాల 20, మెదక్ 6, మేడ్చల్ మల్కాజ్గిరి 39, ములుగు 11, నాగర్కర్నూల్ 9, నల్గొండ 21, నారాయణపేట్ 1, నిర్మల్ 6, నిజామాబాద్ 11, పెద్దపల్లి 15, సిరిసిల్లా 10, రంగారెడ్డి 41, సంగారెడ్డి 20, సిద్ధిపేట్ 12, సూర్యాపేట్ 9, వికారాబాద్ 8, వనపర్తి 7, వరంగల్ రూరల్ 11, వరంగల్ అర్బన్ లో 35, యాదాద్రిలో మరో 11 మందికి వైరస్ సోకింది. అదే విధంగా వైరస్ దాడిలో మరో ముగ్గురు మృతి చెందినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2,84,074 కి చేరగా, డిశ్చార్జ్ల సంఖ్య 2,75,708కి చేరింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో 16, ప్రైవేట్లో 44 కేంద్రాల్లో ఆర్టిపిసిఆర్ టెస్టులు నిర్వహిస్తుండగా,1076 సెంటర్లలో యంటీజెన్ టెస్టులు నిర్వహిస్తున్నామని హెల్త్ డైరెక్టర్ డా జి శ్రీనివాసరావు తెలిపారు.
70 శాతం మంది అసింప్టమాటిక్ పేషెంట్లే….
రాష్ట్రంలో వైరస్ బారిన పడిన వారిలో 70 శాతం మంది అసింప్టమాటిక్ పేషెంట్లు ఉన్నారు. వీరంతా వైరస్ సోకిన వారం రోజుల్లోనే కోలుకున్నట్లు వైద్యశాఖ హెల్త్ బులెటెన్లో పేర్కొంది. అయితే కరోనా సేకండ్ వేవ్ నేపథ్యంలో రాబోయే నాలుగు వారాలు పాటు ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్యశాఖ నివేదించింది.