Saturday, April 27, 2024

ఎపిలో తొలి కరోనా మరణం

- Advertisement -
- Advertisement -

corona

 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో తొలి కరోనా మరణం నమోదైంది. విజయవాడకు చెందిన 55 ఏళ్ల వ్యక్తి ఈనెల 30న కరోనాతో భాదపడుతూ మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. కరోనా మరణాన్ని శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. ఢిల్లీ నుంచి వచ్చిన కొడుకు ద్వారా అతనికి కరోనా సోకినట్లు వైద్యులు భావిస్తున్నారు. మరోవైపు ఎపిలో కరోనా కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళనలకు గురౌవుతున్నారు. ఇప్పటివరకు ఎపిలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 161కి చేరుకుంది. ఇందులో దాదాపు 140 మంది ఇటీవల ఢిల్లీకి వెళ్లొచ్చినవారే ఉన్నారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం కరోనా వ్యాప్తి నివారణకు అన్ని చర్యలు చేపడుతుంది.

55 yers old Man died with Coronavirus in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News