Friday, April 26, 2024

అమ్మ కోసం.. ఒంటరిగా ఢిల్లీ నుంచి బెంగళూరుకు బుడ్డోడు..

- Advertisement -
- Advertisement -

5yrs old boy

బెంగళూరు: లాక్ డౌన్ పరిస్థితుల కారణంగా రెండు నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఇండియాలో దేశీయ విమానయాన సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. దీంతో తమ కుటుంబాలకు దూరంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్న వారందరూ తిరిగి తమ ప్రాంతాలకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ చిన్న బాలుడు మూడు నెలల తరువాత తన తల్లిని కలుసుకున్నాడు. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో విహాన్ శర్మ అనే 5 సంవత్సరాల బాలుడు ఢిల్లీలో చిక్కుకుపోయాడు.ఆ బాలుడి తల్లి బెంగళూరులో ఉంటోంది. సోమవారం నుంచి దేశీయ విమానాలు తిరిగి ప్రారంభంకావడంతో ఆ బాలుడు ఒంటరిగానే విమానంలో ఢిల్లీ నుంచి బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాడు. అప్పటికే విమానాశ్రయానికి చేరుకున్న తల్లి ఆ బాలుడిని రిసీవ్ చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తన కుమారుడు ఢిల్లీ నుంచి ఒంటరిగా ప్రయాణించాడని, 3 నెలల తరువాత తిరిగి బెంగళూరుకు వచ్చాడని సంతోషం వ్యక్తం చేసింది.

5yrs old boy travels alone from Delhi to Bangalore

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News