Sunday, April 28, 2024

ఎపిలో వాగులోకి దూసుకెళ్లి టవేరా.. ఆరుగురు మృతి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంట వద్ద ఆదివారం టవేరా వాహనం వాగులోకి దూసుకెళ్లిన ఘటనలో ఆరుగురు మృతి చెందగా, మరో నలుగురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారిలో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. కాకుమాను గ్రామానికి చెందిన వారు గుంటూరు రూరల్ మండం ఏటుకూరులో జరిగిన ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసకుంది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు.

ఈక్రమంలో మృతులను సమాధుల శ్రీను(50), పొగడ్త వీరలక్ష్మి(48), సమాధుల వన్నూరు(55), సమాధుల సీతమ్మ(65), పొగడ్త రమణ(48)గా పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో మృతి చెందిన మరొకరి వివరాల కోసం పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. కాగా క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసుల ప్రాధమిక దర్యాప్తులో తేలింది.

6 Killed after car drowned into canal in Guntur

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News