Tuesday, April 30, 2024

జమ్మూకశ్మీరులో భారీ ఎన్‌కౌంటర్‌: ఆరుగురు ఉగ్రవాదులు హతం

- Advertisement -
- Advertisement -

6 Terrorists killed in Encounters in Jammu Kashmir

శ్రీనగర్: జమ్మూకశ్మీరులోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో భద్రతా బలగాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. గురువారం తెల్లవారుజామున అనంతనాగ్ జిల్లాలోని నౌగావ్ షాహబాద్, కుల్గాం జిల్లాల్లోని మిర్హ్ హం ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాగి ఉన్నట్లు సమాచారం అందడంతో భద్రతా బలగాలు స్థానిక పోలీసులతో కలిసి యాంటీ టెర్రరిస్ట్స్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సమయంలో భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాల ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో జైషే మహ్మద్ కు చెందిన ఆరుగురు ఉగ్రవాదులు మరణించారని కశ్మీర్ జోన్ పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. ఈ కాల్పుల్లో ఓ పోలీసు అధికారికి గాయపడ్డారని, ఆయన ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని పేర్కొన్నారు.

6 Terrorists killed in Encounters in Jammu Kashmir

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News