- Advertisement -
విశాఖపట్నం: జిల్లాలోని చోడవరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం చోడవరంలో రెండు ద్విచక్ర వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిని వ్యక్తిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతులను గొర్రెలపాలెంకు చెందిన రాజబాబు(55), రాము(38)లుగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.
2 Killed in Road Accident in Vishakhapatnam
- Advertisement -