Monday, May 6, 2024

దేశంలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు..

- Advertisement -
- Advertisement -

India Reports 13154 new corona cases in 24 hrs

న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా కేసులు మళ్లీ పెరిగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 13,154 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. కరోనాతో మరో 268మంది బాధితులు మృతిచెందారని తెలిపింది. నిన్నటితో పోలిస్తే నాలుగు వేల కేసులు అధికంగా నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.47కోట్లు దాటింది. ఇక కరోనా బారిన పడి ఇప్పటివరకు దేశంలో 4,80,860మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో కరోనా నుంచి 7,486మంది కోలుకోగా.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 3.42కోట్లకు పైగా మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 82,402 కరోనా యాక్టివ్‌గా ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 143.15 కోట్లకు పైగా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేశామని ఆరోగ్య శాఖ తెలిపింది.

India Reports 13154 new corona cases in 24 hrs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News