Friday, May 10, 2024

ఎపిలో కొత్తగా 67 కరోనా కేసులు నమోదు…

- Advertisement -
- Advertisement -

corona cases,

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 8,263 శాంపిల్స్ ని పరీక్షించగా అందులో 67 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు ఎపి వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో అనంతపురం -2, గుంటూరు -13, కడప-2, కృష్ణా -8, కర్నూలు -25, నెల్లూరు-1, విశాఖపట్నం -2 కేసులు నమోదయ్యాయి. లాక్ డౌన్ కారణంతో ఎపిలో చిక్కుబడివున్న గుజరాత్ వాసుల్లో 14 మందికి కోవిడ్-19 పాజిటివ్ వచ్చినట్టు అధికారులు తెలిపారు. దీంతో  రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,717కు చేరింది. కరోనా మహమ్మారితో 589 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ కాగా, 34 మంది చనిపోయారు. ఎపిలో మొత్తం 1094 యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆరోగ్యాంధ్ర ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఎపిలో అన్ని జిల్లాల కంటే కర్నూలు జిల్లాలోనే కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం కర్నూలులో 516 పాజిటివ్ కేసులున్నాయి.

 

ap-covid-19, ap-covid-19

67 new corona cases registered in Andhra Pradesh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News