- Advertisement -
అమరావతి: అధికార పార్టీ అయిన వైసిపికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరో ఝులక్ ఇచ్చింది. ఐదుగురు వైసిపి ఎంఎల్ఎలకు మంగళవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. లాక్ డౌన్ సమయంలో నిబంధనలు అతిక్రమించారని వేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. నోటీసులు జారీ అయిన వారిలో రోజా, విడదల రజని, మధుసూదన్ రెడ్డి, సంజీవయ్య, వెంకట గౌడ్ లు ఉన్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తికి వైసిపి ఎంఎల్ఎలే కారణమని ధర్మాసనంలో వ్యాజ్యం దాఖలైంది. న్యాయవాది ఇంద్రనీల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు వినిపించారు. నిబంధనలు ఉల్లంఘించిన ఎంఎల్ఎపై తీసుకున్న చర్యల వివరాలు తెలుపుతూ కౌంటర్ దాఖలు వేయాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.
AP High Court has issued notices to five YCP MLAs
- Advertisement -