Saturday, May 4, 2024

ఆటోను ఢీకొట్టిన కారు..ఏడుగురికి తీవ్ర గాయాలు..

- Advertisement -
- Advertisement -

Man killed in Road Accident in Bahadurpally

ప్రకాశం: జిల్లాలోని కనిగిరి మండలంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం మధ్యాహ్నం మండలంలోని చల్లగిరగల వద్ద వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి ఆటోను ఢికొట్టింది. దీంతో కారు, ఆటో రెండు వాహనాలు బొల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు తీవ్రంగా గాయపడగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

7 Injured in Road Accident in Prakasam Dist

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News