Monday, May 6, 2024

ప్రజావాణికి 71 ఫిర్యాదులు

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ సిటి : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 71ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతుతో పాటు అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, ట్రైనీ అదనపు కలెక్టర్ కిరణ్మయి, డిఆర్‌డిఓ చందర్, ఆర్డీఓ రవిలకు విన్నవిస్తూ ఆర్జీలు సమర్పించారు. కాగా ఆర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికపుడు పరిశీలన జరుపుతూ పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయాశాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News