Friday, May 10, 2024

హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం

- Advertisement -
- Advertisement -
8 of family killed in road accident in Jhajjar
ఒకే కుటుంబానికి చెందిన 8 మంది దుర్మరణం

బద్లీ: హర్యానాలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఉత్తరప్రదేశ్‌లోని ఓ కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మృతి చెందారు. ఝుజ్జర్ సమీపంలోని బద్లీ వద్ద కెఎంపి ఎక్స్‌ప్రెస్‌వేపై ఆగి ఉన్న కారును వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో గ్గురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారని, మరో బాలిక గాయపడిందని దర్యాప్తు అధికారి ఓం ప్రకాశ్ చెప్పారు. ప్రమాదానికి గుచిన ఎర్టెగా కారులో 11 మంది ఉన్నారని ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజా బాద్ జిల్లాకు చెందిన వీరంతా రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ జిల్లాలోని గోగా మేడి ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు ఆయన చెప్పారు. డ్రైవర్, ఓ మహిళ మాత్రం ఆగిఉన్న వాహనానికి దూరంగా నిలబడి ఉండడంతో ప్రాణాలతో బైటపడ్డారని ఓంప్రకాశ్ తెలిపారు. మృత దేహాలను పోస్టుమార్టం కోసం బహదూర్‌గఢ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News