Tuesday, May 14, 2024

ఢిల్లీలో ఒక్కరోజే 813 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

813 covid-19 cases in a single day in Delhi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పుడు శనివారం ఒక్కరోజే 800కు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఈ ఏడాది ఇంత పెద్ద సంఖ్యలో వైరస్ విషయంలో 24 గంటల రికార్డు కావడం ఇదే తొలిసారి. ప్రస్తుత పరిణామంతో రెండు నెలల తరువాత పాజిటివ్ రేటు 1 శాతాన్ని దాటింది. ఇద్దరి మరణంతో ఇప్పటి వరకూ ఢిల్లీలో కరోనా మృతుల సంఖ్య 10,955కు చేరింది . ఈ వివరాలన్నింటిని ఆరోగ్య శాఖ శనివారం నాటి గణాంక నివేదికలో తెలిపారు. ఇక యాక్టివ్ కేసుల సంఖ్య 3165 ఉండగా, ఇప్పుడు 3409కు చేరుకుంది. ఒక్కరోజే మొత్తం 813 మందికి కరోనా సోకిందని వెల్లడైంది. దీనితో ఇక్కడ మొత్తం మీద వైరస్ బారిన పడ్డ వారి సంఖ్య 6,47,161 అయింది. రికవరీ సంఖ్య 6.32 లక్షలు దాటింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News