Monday, May 6, 2024

ఎపిలో మరో 86మంది మృతి..

- Advertisement -
- Advertisement -

8601 New Corona Cases registered in AP

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. దీంతో రాష్ట్రంలో ప్రతీరోజు 8 నుంచి 10వేల కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 8,601 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. కరోనాతో మరో 86 మంది బాధితులు మృతి చెందినట్లు తెలిపింది. దీంతో ఎపిలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 3,61,712కు చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారిన పడి 3,368 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 89,516 మంది కరోనా బాధితులు రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా ఇప్పటివరకు 2,68,828 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఎపిలో గడిచిన 24 గంటల్లో 54,463 కరోనా పరీక్షలు చేశామని ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 32,92,501 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు పేర్కొంది.

8601 New Corona Cases registered in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News