Wednesday, May 1, 2024

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 9మంది దుర్మరణం

- Advertisement -
- Advertisement -

9 Killed in Road Accident in Karnataka

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం ఉదయం తుముకూరులో జాతీయ రహదారిపై ఎదురెదురుగా వేగంగా దూసుకొచ్చిన లారీ, కారు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 9మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 12మందికి పైగా గాయాలు కాగా, వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారంతా రాయచూరు జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించనున్నట్లు పోలీసులు తెలిపారు.

9 Killed in Road Accident in Karnataka

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News