న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా వేదికగా ఫిబ్రవరిలో జరగనున్న టి20 ప్రపంచకప్కు భారత మహిళా జట్టును బిసిసిఐ ప్రకటించింది. హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఆదివారం ఎంపిక చేసింది. హర్యానాకు చెందిన పదిహేనేళ్ల షెఫాలీ వర్మ తొలిసారిగా ఐసిసి టోర్నీమెంట్ కు సెలెక్ట్ చేశారు. షెఫాలీతో పాటు మరో కొత్త ప్లేయర్ రిచా ఘోష్ జట్టులో స్థానం దక్కించుకుంది. ఈ మెగాటోర్నీలో గ్రూప్-ఎలో భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్ లు ఉన్నాయి. ఇక గ్రూప్-బిలో ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, పాకిస్థాన్, థాయ్లాండ్ ఉన్నాయి. ఫిబ్రవరి 21న ఆసీస్తో జరిగే తొలిపోరుతో భారత మెగా టోర్నీని ప్రారంభించనుంది. కాగా, వరల్డ్కప్కు సన్నాహకంగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలతో నిర్వహించనున్న ముక్కోణఫు టి20 టోర్నీకి కూడా 16 మందితో కూడిన భారత మహిళల జట్టును ప్రకటించారు. ప్రపంచకప్ బరిలో దిగనున్న జట్టుతో మరో ప్లేయర్ నుజహత్ పర్వీన్ జత కలువనుంది. ఈనెల 31 నుంచి వచ్చేనెల 12 వరకు మెల్బోర్న్లో ఈ ముక్కోణఫు టి20 టోర్నీ జరుగనుంది.
ప్రపంచకప్కు భారత జట్టు : హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ, జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, వేద కృష్ణమూర్తి, దీప్తి శర్మ, రిచా, తానియా భాటియా, పూనమ్ యాదవ్, రాధా యాదవ్, రాజేశ్వరీ గైక్వాడ్, శిఖా పాండే, అరుంధతి రెడ్డి, పూజా వస్త్రాకర్.
టి20 సిరీస్కు భారతజట్టు : హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ, జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, వేద కృష్ణమూర్తి, దీప్తి శర్మ, రిచా, తానియా భాటియా, పూనమ్ యాదవ్, రాధా యాదవ్, రాజేశ్వరీ గైక్వాడ్, శిఖా పాండే, అరుంధతి రెడ్డి, పూజా వస్త్రాకర్, పర్వీన్.
📢Squad Announcement📢@ImHarmanpreet will lead India's charge at @T20WorldCup #T20WorldCup #TeamIndia pic.twitter.com/QkpyypyJKc
— BCCI Women (@BCCIWomen) January 12, 2020
Team India Select for ICC Womens T20 World Cup 2020