- Advertisement -
ముంబయి పోలీసుల సేవలను గుర్తు చేసుకుంటూ వారి గౌరవార్థం ప్రతి ఏటా నిర్వహించే ‘ఉమాంగ్’ కార్యక్రమం ఈ సంవత్సరం కూడా ఆర్భాటంగా జరిగింది. ‘ఉమాంగ్-2020’ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అనేకమంది బాలీవుడ్ తారలు తళుక్కుమన్నారు. ప్రియాంక చోప్రా, కత్రినాకైఫ్, రకుల్ ప్రీత్సింగ్, విద్యాబాలన్, జాన్వీకపూర్, మనీషాకోయిరాలా చీరకట్టులో మెరిసిపోయారు. కథానాయకులు సల్మాన్ఖాన్, షారుఖ్ఖాన్తోపాటు వరుణ్ ధావన్, కార్తీక్ ఆర్యన్ తదితరులు అలరించారు. వరుణ్ ధావన్, కార్తీక్ ఆర్యన్ డ్యాన్స్ చేసి ప్రేక్షకులను మెప్పించారు. వీటికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్గా మారాయి.
Umang Awards 2020
- Advertisement -