హైదరాబాద్: నగరంలోని మియాపూర్లో బుధవారం తెల్లవారుజామున ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న హోటల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాద ఘటనలో హోటల్లో కూర్చున్న ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా… మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను తక్షణమే చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. స్థానికులు సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేమాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతుడిని ఓ ప్రయివేటు స్కూల్ కి చెందిన కరస్పాండెంట్ గా పోలీసులు గుర్తించారు. కారు డ్రైవర్ సంతోష్ పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. అతను మద్యం మత్తులో కారు నడిపినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
One Dead Four Injured In Road Accident At Miyapur