Monday, April 29, 2024

సనత్‌నగర్‌లో విద్యార్థిని చితకబాదిన దంపతులు

- Advertisement -
- Advertisement -

govt-school

హైదరాబాద్: నగరంలోని సనత్‌నగర్‌లో దారుణం చోటుచేసుకుంది.  అభంశుభం తెలియని ఓ విద్యార్థి పట్ల దంపతులు దారుణంగా ప్రవర్తించారు. ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థిని విచక్షణారహితంగా చితకబాదారు. చిన్నపిల్లలు అని కనికరం లేకుండా కొట్టడంతో పాటు, వారిని తెలిసిన వారిని పిలిపించి మరీ దాడి చేశారు. దెబ్బలు తట్టుకోలేక దంపతులు కాళ్లు పట్టుకున్న కనికరించలేదు. దాడి చేసి అనంతరం స్కూల్ విద్యార్థిపై పోలీస్ స్టేషన్ లో దంపతులు  ఫిర్యాదు చేశారు. స్కూల్ కి వెళ్లున్న సమయంలో అల్లరి చేస్తూ తమ పిల్లలపై చేయి చేసుకున్నారని దంపతులు ఆగ్రహించి విద్యార్థిని రోడ్డుపై ఈడ్చుకుంటూ వచ్చి చితకబాదారు. సనత్‌నగర్‌ లో జరిగిన ఈ దాడిపై విద్యార్థులు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిసిటివి దృశ్యాలను పరిశీలించిన పోలీసులు దంపతులపు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. చిన్నారులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Couple Beaten Govt School Student At Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News