- Advertisement -
సూర్యాపేట: ప్రతి ఇంట్లో గ్రీనరీని పెంచేందుకు చొరవ చూపాలని మంత్రి జగదీశ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని 33వ వార్డులో గురువారం తెల్లవారుజామున మంత్రి జగదీశ్ రెడ్డి పర్యటించారు. వార్డుల వారీగా శానిటేషన్ ప్రణాళిక రూపొందించాలన్నారు. తడి, పొడి చెత్తను వేరు చేసేలా ప్రజలను చైతన్యపరచాలని సూచించారు. మున్సిపాలిటీల్లో పది శాతం నిధులు పచ్చదనం పెంపునకు ఖర్చు చేయాలని పేర్కొన్నారు. 75 గజాల లోపల ఇల్లు కట్టుకుంటే ఎలాంటి అనమతి అవసరం లేదని జగదీశ్ స్పష్టం చేశారు.
- Advertisement -