- Advertisement -
హైదరాబాద్: అన్ని వర్గాల ప్రజలను ఆదుకోవాలన్నది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. తెలంగాణ భవన్లో జరిగిన టైలర్స్ డే వేడుకలలో ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడారు. గత ప్రభుత్వాలు పేదవారిని పట్టించుకోలేదని, హైదరాబాద్లో అన్ని కులాల వారికి ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తామని ఈటెల తెలిపారు. కులవృత్తులను ప్రోత్సహించే విధంగా సిఎం కెసిఆర్ చర్యలు తీసుకోవాలన్నారు. దేశంలోనే గొప్ప రాష్ట్రంగా తెలంగాణ ఎదుగుతోందని ఈటెల చెప్పారు.
- Advertisement -