- Advertisement -
హైదరాబాద్: గత ఆరు నెలలుగా తెలంగాణలో పొదుపు చర్యలు చేపడుతున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా తలసాని మీడియాతో మాట్లాడారు. తెలంగాణ బడ్జెట్ను అందరూ మెచ్చుకుంటున్నారని కొనియాడారు. అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సిఎం కెసిఆర్ సమర్థవంతంగా ముందుకు తీసుకుపోతున్నారని ప్రశంసించారు. అన్ని సామాజిక వర్గాలను అభివృద్ధి చేయాలన్నదే కెసిఆర్ లక్ష్యమని స్పష్టం చేశారు. బడ్జెట్ను చూసి ప్రజలు సంతోషం పడుతున్నారని, దేవాలయాలు కోసం రూ.500 కోట్లు కేటాయించిన చరిత్ర ఎక్కడా లేదన్నారు.
- Advertisement -