Tuesday, April 30, 2024

కరీంనగర్ లో మరింత కఠినంగా లాక్ డౌన్..

- Advertisement -
- Advertisement -

 

కరీంనగర్: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కరీంనగర్ లో మంగళవారం నుంచి మరింత కఠినంగా లాక్ డౌన్ అమలు చేయనున్నట్లు కలెక్టర్ శశాంక్ పేర్కొన్నారు. ఇండోనేషియా వాసులు పర్యటించిన ముకరంపుర ప్రాంతాన్ని బారికేడ్స్ తో దిగ్భందం చేశారు. ముకరంపుర ప్రాంత వాసులకు కావాల్సిన నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పాలు అధికారులే పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇండోనేషియా వాసులు సంచరించినట్లు అనుమానం ఉన్న ప్రాంతాల్లో ఇంటింటి వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయన్నారు. కూరగాయల కోసం రైతు బజార్లు, మార్కెట్లకు గుంపులుగా వెళ్లొద్దని, అన్ని కాలనీల సమీపంలో కూరగాయలు అమ్మే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశామని, హెల్ప్‌లైన్ నంబర్ 18004250817కు ఫోన్ చేయవచ్చని తెలిపారు.

Will lockdown enforced strictly in Karimnagar: Collector

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News