- Advertisement -
కరోనాపై పోరుకు ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ (ఎఫ్ఎన్సిసి) తన వంతు విరాళాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేసింది. ఎఫ్ఎన్సిసి తరఫున సంస్థ అధ్యక్షుడు ఆదిశేషగిరి రావు, కార్యదర్శి కె.ఎస్.రామారావు, ఎఫ్ఎన్సిసి వ్యవస్థాపక సభ్యుడైన జూబ్లీహిల్స్ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ, ఎఫ్డిసి ఛైర్మన్ రామ్మోహన్ రావులు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో మంత్రి కెటిఆర్ను కలిసి రూ.25 లక్షల విరాళాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు.
హీరో సాగర్ రూ.5 లక్షల విరాళం…
కరోనా మహమ్మారి నివారణార్థం హీరో సాగర్ (మొగలిరేకులు ఫేమ్ ఆర్.కె.నాయుడు) రూ.5 లక్షల విరాళాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేశారు. ఈ మేరకు సాగర్ రాష్ట్ర మంత్రి కెటిఆర్ను కలిసి రూ.5 లక్షల చెక్ను ఆయనకు అందజేశారు.
FNCC donates Rs 25 lakh
- Advertisement -