వరంగల్ అర్బన్: టిఆర్ఎస్ శ్రేణులందరికీ ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. టిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హన్మకొండలో అమర వీరుల స్థూపానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది టిఆర్ఎస్ పార్టీయే అని, అనేక కష్ట నష్టాల కోర్చి సిఎం కెసిఆర్ తెలంగాణ సాధించారని, సాధించుకున్న తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారని పొగిడారు. తెలంగాణను సిఎం కెసిఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తున్నారని ఎర్రబెల్లి ప్రశంసించారు. పార్టీ కోసం అహర్నిశలూ పని చేస్తున్న పార్టీ శ్రేణులందరికీ ధన్యవాదాలన్నారు. కరోనా కట్టడిలో సిఎం కెసిఆర్ దేశానికే ఆదర్శంగా నిలిచారని, బిజెపి నేతలు ధాన్యం కొనుగోళ్లను విమర్శించడం సిగ్గు చేటని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎంఎల్సి కడియం శ్రీహరి, మేయర్ గుండా ప్రకాశ్ రావు, చైర్మన్ మర్రి యాదవరెడ్డి, మాజీ ఎంపి సీతారాంనాయక్లు ఉన్నారు.