- Advertisement -
చత్తీస్గఢ్: చత్తీస్గఢ్ రాజ్నందగాన్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు-మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక ఎస్సై, నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్కౌంటర్ మాన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పర్ధోని గ్రామ దగ్గర చోటుచేసుకుంది. మావోయిస్టులను మట్టుపెట్టే క్రమంలో మదన్ వాడ ఎస్సై ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల అనంతరం సంఘటన స్థలంలో ఎకె 47 రైఫిల్, రెండు 315 బోర్ రైఫిళ్లు, ఓ ఎస్ఎల్ఆర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నామని రాజ్నందగాన్ ఎఎస్పీ జిఎన్ బాఘెల్ తెలిపారు.
4 naxals killed in an encounter near Pardhoni village
- Advertisement -