- Advertisement -
న్యూఢిల్లీ: త్వరలోనే భారత వాయు సేన మరింత పటిష్టం కానుంది. నాలుగు రాఫెల్ యుద్ధ విమానాలు వాయుసేన అమ్ములపొదిలో చేరనున్నాయి. ఇప్పటికే ఈ యుద్ధవిమాయానాలు భారత్ చేరుకోవలసి ఉండగా కరోనా కారణంగా ఆలస్యమైంది. ఇవి జూలై నెల చివరి నాటికి భారత్ చేతికి దక్కనున్నాయి. అయితే, దీనికి సంబంధించిన తేదీని ఇంకా ఖరారు చేయలేదు. ఫ్రాన్స్ ఈ యుద్ద విమానాలను భారత్కు అందించనుంది. మొదట మే నెలలోనే ఈ యుద్ద విమానాలు మన దేశానికి రావాల్సి ఉండగా కరోనా కారణంగా చేరుకోలేకపోయాయి.
4 Rafale fighter Jets to arrive in India by july
- Advertisement -