Monday, April 29, 2024

టిఆర్‌ఎస్ పార్టీలో చేరిన బిజెపి కార్పొరేటర్లు

- Advertisement -
- Advertisement -

TRS party

 

మనతెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి కెసిఆర్ పాలన చూసి, ప్రభుత్వం అమలుచేస్తున్న పలు సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై నిజామాబాద్ కార్పొరేషన్‌కు చెందిన పలువురు బిజెపి కార్పొరేటర్లు, నాయకులు టిఆర్‌ఎస్ పార్టీలో చేరడం శుభపరిణామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో నిజామాబాద్ అర్భన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఆధ్వర్యంలో బిజెపికి చెందిన సాయివర్ధన్ 9వ డివిజన్, విక్రం గౌడ్ 8వ డివిజన్, బట్టు రాఘవేందర్ 50వ డివిజన్లకు చెందిన పలువురు కార్పొరేటర్లు, పలువురు బిజెపి నాయకులు మంత్రి సమక్షంలో పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా మంత్రి పలువురికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. సిఎం కెసిఆర్ రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి పేదల పెన్నిధిగా నిలిచారన్నారు. దండగ అన్న వ్యవసాయాన్ని పండుగ చేసి చూపించిన రైతు బాంధవుడు ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం, సిఎం కెసిఆర్ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు నచ్చి వివిధ పార్టీల నేతలు టిఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పట్టణాల అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేస్తున్నారన్నారు.

మంత్రి పనితీరే జిల్లా ప్రజలకు భరోసా: ఎమ్మెల్యే గణేశ్ గుప్తా

టిఆర్‌ఎస్ పార్టీలో చేరిన నిజామాబాద్ కార్పొరేషన్‌కు చెందిన బిజెపి కార్పొరేటర్లు, నాయకులకు జిల్లా టిఆర్‌ఎస్ పార్టీ తరపున మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. తమ డివిజన్ల అభివృద్ధి కోసం, ప్రభుత్వ కార్యక్రమాలు నచ్చి పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ టిఆర్‌ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, డివిజన్ల అభివృద్ధికి తాను కృషి చేస్తానని మంత్రి ఈ సందర్భంగా వారికి హామినిచ్చారు. అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి పాటు పడుతున్న ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మాజి ఎంపి కవిత నాయకత్వంలో పనిచేసేందుకు పలువురు నాయకులు టిఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు.

ప్రస్తుతం నిజామాబాద్ కార్పొరేషన్‌కు చెందిన బిజెపి కార్పొరేటర్లు ముగ్గురు మంత్రి ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టిఆర్‌ఎస్ పార్టీలో చేరారన్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి కోవిడ్-19 నిర్మూలన కోసం జిల్లా అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ జిల్లాలో కరోనాను కట్టడి చేసేందుకు కృషి చేస్తున్నారన్నారు. మంత్రి పనితీరు వల్ల జిల్లా ప్రజలకు భరోసాతో ఉన్నారన్నారు. నిజామాబాద్ టౌన్ లో వైరస్ విస్తరించకుండా వారానికి మూడు, నాలుగు రోజులు జిల్లాలోనే ఉంటూ కోవిడ్-19 వ్యాప్తి చెందకుండా కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News