- Advertisement -
మంగపేట: ములుగు జిల్లాలోని మంగపేట మండలం కొత్త మల్లూరులో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగిఉన్న లారీని బైక్ పై వెళ్తున్న వ్యక్తి అదుపు తప్పి ఢీకొట్టింది. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని గమనించిన ముగ్గురు వ్యక్తులు అతడిని కాపాడేందుకు వెళ్లారు. వారిని మరో బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా… ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. స్థానికులు సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
One Person Death in Road Accident At Mulugu District
- Advertisement -